పోస్ట్‌లు

మార్చి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

చిత్రం
సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు  భట్టిప్రోలు విజయలక్ష్మి   తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు చాలా ప్రత్యేకమైనవిగా పేరు పడ్డాయి. వీటినే ఆరుపడైవీడు అంటారు. అవి పళని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుత్తణి, తిరుప్పరంకుండ్రం, పళియముదిర్ చోళై. వీటిల్లో మేము ఆ మొదటి అయిదు క్షేత్రాలు మాత్రమే దర్శించుకోగలిగాం. ఎందుకో ఆ ఆరోది మిస్ అయ్యింది. ఈ అన్ని క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యుడు ఎంతో అందంగా, సమ్మోహనంగా ఉంటాడు. ఈ క్షేత్రాలను గురించి వరుసగా చెప్పుకుందాం.   ఆరుపడైవీడులో మొదటిది పళని క్షేత్రం. మేము 1987లో సౌత్ టూర్ లో భాగంగా చూసాం. దండాయుధ పాణి, వేలాయుధ పాణి అని ఇక్కడి దేవుడికి పేరు. ఇక్కడ దేవుడు బాల సుబ్రహ్మణ్యుడు, కౌపీనధారుడు. నున్నటి గుండుతో చిన్న గోచీతో, ఒక చేతితో శూలాన్ని పట్టుకుని, మరో చెయ్యి నడుం మీద పెట్టుకుని రుద్రాక్షమాలలు ధరించి ముద్దుగా ఉంటాడు ఈ బాల సుబ్రహ్మణ్యుడు. ఈ విగ్రహాన్ని నవపాషాణంతో భోగార్ అనే భక్తుడు తయారుచేశాడు. నవపాషాణం అంటే తొమ్మిది విషపదార్ధాలు కలిపిన ఒక ధాతువు. ఈ తొమ్మిది విషపదార్ధాలను ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో కలిపిత...

కుంభకోణం

చిత్రం
కుంభకోణం  కుంభకోణం తమిళనాడులోని ఒక ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రం. ఇక్కడ లెక్కలేనన్ని దేవాలయాలు వున్నాయి. అసలు ఈ వూరే పుణ్యక్షేత్రాల నగరం. కాశీలో లింగాలు ఎన్ని ఉన్నాయో చెప్పటం ఎంత కష్టమో, ఈ వూళ్ళో  మొత్తం ఎన్ని దేవాలయాలున్నాయో చెప్పటం కూడా  అంత కష్టం. పైగా దాదాపు అన్నీ పురాతన ఆలయాలే. ఇక్కడ వున్న ప్రధానాలయం, ఆది కుంభేశ్వరాలయంలో ఉన్న కుంభేశ్వరస్వామి పేరు మీదే ఈ ఊరును కుంభకోణం అని పిలుస్తున్నారు. ఇక్కడ వున్న అన్ని ఆలయాల గురించీ చెప్పటం కూడా అసాధ్యం. ఒకవేళ చెప్తే,  అదే ఒక మహాభారతం అంత పెద్ద గ్రంథం అవుతుంది. మనం కొన్ని శివాలయాలు గురించి మాత్రం ముచ్చటించుకుందాం.  సుమారు 20 కిమీ పరిధిలో  చోళరాజుల కాలంలోనే నిర్మించబడ్డ ఇతర దేవతల ఆలయాలు కాకుండా  కేవలం శివాలయాలే సుమారుగా  37  వు న్నాయి. అన్నింటిలో ముఖ్యమైన ఆది కుంభేశ్వరాలయం గురించి ముందుగా చెప్పుకుందాం.                               యుగాంతమప్పుడు ఈ సకల సృష్టి ఆ మహాప్రళయంలో లయించిపోతూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శ...