పోస్ట్‌లు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

చిత్రం
సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు  భట్టిప్రోలు విజయలక్ష్మి   తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు చాలా ప్రత్యేకమైనవిగా పేరు పడ్డాయి. వీటినే ఆరుపడైవీడు అంటారు. అవి పళని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుత్తణి, తిరుప్పరంకుండ్రం, పళియముదిర్ చోళై. వీటిల్లో మేము ఆ మొదటి అయిదు క్షేత్రాలు మాత్రమే దర్శించుకోగలిగాం. ఎందుకో ఆ ఆరోది మిస్ అయ్యింది. ఈ అన్ని క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యుడు ఎంతో అందంగా, సమ్మోహనంగా ఉంటాడు. ఈ క్షేత్రాలను గురించి వరుసగా చెప్పుకుందాం.   ఆరుపడైవీడులో మొదటిది పళని క్షేత్రం. మేము 1987లో సౌత్ టూర్ లో భాగంగా చూసాం. దండాయుధ పాణి, వేలాయుధ పాణి అని ఇక్కడి దేవుడికి పేరు. ఇక్కడ దేవుడు బాల సుబ్రహ్మణ్యుడు, కౌపీనధారుడు. నున్నటి గుండుతో చిన్న గోచీతో, ఒక చేతితో శూలాన్ని పట్టుకుని, మరో చెయ్యి నడుం మీద పెట్టుకుని రుద్రాక్షమాలలు ధరించి ముద్దుగా ఉంటాడు ఈ బాల సుబ్రహ్మణ్యుడు. ఈ విగ్రహాన్ని నవపాషాణంతో భోగార్ అనే భక్తుడు తయారుచేశాడు. నవపాషాణం అంటే తొమ్మిది విషపదార్ధాలు కలిపిన ఒక ధాతువు. ఈ తొమ్మిది విషపదార్ధాలను ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో కలిపిత...

కుంభకోణం

చిత్రం
కుంభకోణం  కుంభకోణం తమిళనాడులోని ఒక ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రం. ఇక్కడ లెక్కలేనన్ని దేవాలయాలు వున్నాయి. అసలు ఈ వూరే పుణ్యక్షేత్రాల నగరం. కాశీలో లింగాలు ఎన్ని ఉన్నాయో చెప్పటం ఎంత కష్టమో, ఈ వూళ్ళో  మొత్తం ఎన్ని దేవాలయాలున్నాయో చెప్పటం కూడా  అంత కష్టం. పైగా దాదాపు అన్నీ పురాతన ఆలయాలే. ఇక్కడ వున్న ప్రధానాలయం, ఆది కుంభేశ్వరాలయంలో ఉన్న కుంభేశ్వరస్వామి పేరు మీదే ఈ ఊరును కుంభకోణం అని పిలుస్తున్నారు. ఇక్కడ వున్న అన్ని ఆలయాల గురించీ చెప్పటం కూడా అసాధ్యం. ఒకవేళ చెప్తే,  అదే ఒక మహాభారతం అంత పెద్ద గ్రంథం అవుతుంది. మనం కొన్ని శివాలయాలు గురించి మాత్రం ముచ్చటించుకుందాం.  సుమారు 20 కిమీ పరిధిలో  చోళరాజుల కాలంలోనే నిర్మించబడ్డ ఇతర దేవతల ఆలయాలు కాకుండా  కేవలం శివాలయాలే సుమారుగా  37  వు న్నాయి. అన్నింటిలో ముఖ్యమైన ఆది కుంభేశ్వరాలయం గురించి ముందుగా చెప్పుకుందాం.                               యుగాంతమప్పుడు ఈ సకల సృష్టి ఆ మహాప్రళయంలో లయించిపోతూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శ...

శ్రీకాళహస్తి-గుడిమల్లం

చిత్రం
  శ్రీకాళహస్తి - గుడిమల్లం  ఇప్పటివరకూ నాలుగు పంచ భూత ఆలయాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిగిలిన అయిదో పంచభూత క్షేత్రమైన శ్రీకాళహస్తి లోని వాయులింగాన్ని దర్శిద్దాం రండి. మేము ఈ ఆలయాన్ని కనీసం పది, పదిహేను సార్లైనా చూసి ఉంటాం. మేము తిరుపతికి వెళ్లిన ప్రతిసారీ కాకపోయినా  కొన్నిసార్లైనా ఇక్కడికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వాయుదేవుడు కర్పూరంతో శివలింగాన్ని తయారుచేసి ఆ కర్పూర లింగానికి ఎంతో శ్రద్ధతో పూజలు చేసాడట. వాయుదేవుడి భక్తికి మెచ్చిన శివుడు ఆ ప్రాంతం లోనే వాయుదేవుడితో సహా లింగరూపంలో కొలువుంటానని వరం ఇచ్చాడట. ఇక్కడ వాయువు ఉన్నదనటానికి సాక్ష్యంగా, ఈ శివుడు ఊపిరి పీలుస్తుండటం నిదర్శనంగా చెపుతారు. ఈ ఆలయంలో పైకప్పు నుంచి వేళ్ళాడుతున్న రెండు అఖండ దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. అందులో ఎడమవైపు పెట్టిన దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. అదే సమయంలో కుడివైపున పెట్టిన దీపం స్థిరంగా నిల్చి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ శివుడికి వాయువుతో వున్న అనుబంధానికి ఇదే నిదర్శనం. ఇదే విధంగా శ్వాసించే నారసింహమూర్తి నల్గొండ జిల్లా వాడపల్లిలో ఉంది. ఆ విశేషాలు వైష్ణవ క్షేత్రాలలో చెప్పుకుందాం....

తిరువణ్ణామలై-అగ్నిలింగం

చిత్రం
తిరువణ్ణామలై-అగ్నిలింగం  పంచభూత లింగాలలో ఇంతవరకు పృధ్వీ లింగం, జల లింగం, ఆకాశ లింగం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అగ్ని లింగం గురించి చెప్పుకుందాం. ఆ తరువాత వాయు లింగం గురించి చెప్పుకుందాం. అన్నట్టు ఇక్కడ నేను ఇంతవరకూ చెప్పని మరో విషయం కూడా చెపుతాను. అది మన పంచేద్రియాలకూ, పంచభూతాలకూ గల సంబంధం. పంచభూతాలూ మన పంచేంద్రియాలతో ఎలా పని చేయిస్తున్నాయో చూడండి.  ఆకాశం నుంచి శబ్దం ఉత్పన్నం అవుతోంది, దాన్ని మనం చెవుల ద్వారా వినగలం. మధ్యలో వున్న స్పేస్, లేదా మీడియం ద్వారా మాత్రమే శబ్దం పయనిస్తుంది. అదే ఆకాశం. అంటే ఆకాశం మన శ్రవణేంద్రియం పనిచేసేలా చేస్తోంది. ఇక మనకు గాలితో స్పర్శ తెలుస్తోంది, అంతేకాక గాలి శబ్దాన్ని వినగలం కూడా. ఇక్కడ గాలి తన స్పర్శ చేత త్వక్ (చర్మము) ఇంద్రియాన్ని, శ్రవణేంద్రియాన్ని పనిచేయిస్తోంది. ఆ తరువాత అగ్ని, ఈ అగ్నికి శబ్దం, స్పర్శ మాత్రమే కాక రూపం కూడా వుంది. మనకు హోమ గుండంలో ఎన్నెన్ని రూపాలు కనిపిస్తాయో కదా. కనుక అగ్ని మన త్వక్ ఇంద్రియాన్ని, శ్రవణేంద్రియాన్నే కాక, చక్షువులు కూడా పనిచేసేలా చేస్తోంది. అంటే మనం అగ్ని రూపాన్ని చూడగలం, శబ్దాన్ని వినగలం, స్పర్శనూ అనుభ...